కమ్మని కూరగాయల తోట!

కమ్మని కూరగాయల తోట!
ఇంటి పంట 09 -04 -2011

ఆసక్తి ఉంటే మేడ మీదైనా చక్కగా కావాల్సినన్ని ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యదాయకమైన రీతిలో పెంచుకోవడానికి పెద్దగా ప్రయాసపడాల్సిన అవసరం లేదని విజయవాడలో నివసిస్తున్న రావూరి సాదిక్ (98496 32813), శేషారత్నం దంపతులు సంతోషంగా చెపుతున్నారు. బెంజి సర్కిల్‌లోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో ఎక్స్‌రే లాబ్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న సాదిక్ పటమటలోని అశోక్‌నగర్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.

కూరగాయలు తానే పండించుకునేందుకు 2006 మార్చిలో శ్రీకారం చుట్టారు. టెరస్ ్రమీద దాదాపు 750 చదరపు గజాల స్థలంలో వారు పర్మినెంట్‌గా సిమెంట్‌తో పొడవాటి తొట్లు కట్టించారు. 20 అడుగుల పొడవున రెండు తొట్లు కట్టారు. తీగ జాతి కూరగాయల సాగు కోసం ప్రత్యేకంగా ఇనుప రాడ్లతో పక్కాగా పందిరి కూడా వేయించారు.

ఫలితాలు ఉత్సాహపూరితంగా ఉండడంతో ఎల్ షేప్‌లో మరో తొట్టి కట్టించారు. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. ఎక్కువైన నీరు తొట్ల కింద నుంచి బయటకు పోయేలా రంధ్రాలు ఏర్పాటు చేశారు. రకరకాల ఆకుకూరలు, కూరగాయలు ఏడాదిపొడవునా పండించుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారం తాము తినడమే కాకుండా బంధుమిత్రులకు పంచుతున్నారు. ఎటువంటి చీడపీడలు మొక్కల దరిచేరడం లేదని, విష రసాయనాలు వాడాల్సిన అవసరమే రావడం లేదంటున్నారు సాదిక్. సిటీ ఫార్మింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఆయన మాటల్లోనే..

మేడపైనే 11 నెలలూ పండిస్తాం


ఆసక్తి ఉండి.. తొలుత కొద్దిగా పెట్టుబడి పెడితే.. తదనంతరం రుచికరమైన కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చు. మేలో తప్ప ఏడాదికి 11 నెలలు మాకు కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు. ఆకుకూరలైతే బెజ వాడ మే ఎండలను కూడా తట్టుకుంటాయి. మొక్కలంటే మా ఆవిడతోపాటు పిల్లలకూ చాలా ఇష్టం. మేడ మీద నేరు గా మట్టి పోసి మొక్కలు పెంచుతుంటే.. టెరస్ ్రశ్లాబ్ దెబ్బతింటుందేమోనని.. కొంచెం ఎత్తులో సిమెంటు తొట్లు కట్టిం చాను. తొట్టెలను ఒకటిన్నర అడుగుల లోతున.. అడుగుకు పైగా వెడల్పుతో కట్టించాను. మొదట సారవంతమైన నల్లమట్టితో నింపి మొక్కలు పెంచడం ప్రారంభించాం. తర్వాత వారానికో, పది రోజులకు ఒకసారి మొక్కకు గుప్పెడు వర్మీ కంపోస్ట్ వేస్తున్నాం. ఆరేళ్లయినా ఆ మట్టి మార్చలేదు. టమాటా, వంగ, పాలకూర, తోటకూర చక్కగా రావడం తో.. బెండ, పచ్చిమిర్చి, గోంగూర, బచ్చలి కూర, పుదీనా వేశాం. మొక్కల ఎదుగుదల మందగించిందనిపించినప్పు డు కొద్దిగా యూరియా వేస్తున్నాం. అప్పుడప్పుడు గండు చీమలు కనిపిస్తుంటే.. గమాక్సిన్ చల్లుతున్నాం. అంతకు మించి చీడపీడల బాధ లేనే లేదు. పైపులకు బెజ్జాలుపెట్టి ట్యాంక్‌కు వాల్వ్ బిగించాం.

సాయంత్రం పూట పావుగంటలో మొక్కలకు నీరుపెడుతున్నాం. మరీ వడగాడ్పులున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలప్పుడు నీరు మొక్కలపై స్ప్రే చేస్తుంటాం. అలవాటైపోవడం వల్ల మాకు ఈ పని ప్రయాస అనిపించడం లేదు. బంగాళదుంపలు, క్యాబేజీ తప్ప మరేం కొనడం లేదు. ఇంత పెద్దమొత్తంలో కాకపోయినా.. రెండేసి చొప్పున వంగ, టమాటా, బీర, పచ్చిమిర్చి, మూడు, నాలుగు రకాల ఆకుకూరలు పెట్టుకుంటే చిన్న కుంటుంబం మేడ మీద స్థలంలోనే తమకు తామే చక్కగా పండించుకోవచ్చు. రెండు మొక్కలే కదా అనుకోకండి.. కిలోలకు కిలోలు కాస్తాయి.

ఉదయం నుంచి సాయంత్రం వరకూ లాబ్‌లో నాలుగ్గోడల మధ్య కూర్చొనే ఉంటాను. అక్కడి నుంచి మేడపైన ఉన్న కిచెన్ గార్డెన్‌లోకి అడుగుపెట్టగానే.. ఆ విసుగంతా పోయి.. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. చిన్నప్పుడు తిన్న రుచికరమైన కూరగాయలు ఇప్పుడూ పండించుకుంటున్నాం. మా తోటలో అప్పుడప్పుడూ మిత్రులందరం కూర్చొని హాయిగా మాట్లాడుకుంటుంటాం.. అంతకన్నా ఇంకేం కావాలి..?


నేడే నాగార్జున నగర్‌లో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్
ఎల్లారెడ్డిగూడ (పంజాగుట్ట నుంచి శ్రీనగర్ కాలనీ వెళ్లే రోడ్డు)లోని నాగార్జుననగర్ సంక్షేమ సంఘం హాలు(9492046650)లో ఈ నెల 9 శనివారం సాయంత్రం (4 గంటల నుంచి 7 గంటల మధ్యలో) ఇంటి పంట వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ‘సాక్షి’, నాగార్జున నగర్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్‌షాప్‌లో మీరూ పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం.

intipanta@googlegroups.com
‘ఇంటిపంట’ పాఠకులు నిపుణులను సంప్రదించడం కోసం, తమ అనుభవాలను పంచుకోవడం కోసం గూగుల్‌గ్రూప్స్.కామ్‌ను వినియోగించుకోవచ్చు. intipanta@googlegroups.com కు మెయిల్ పంపితే చాలు ఈ గ్రూప్‌లో సభ్యులు కావచ్చు. ఈ మెయిల్ ఐడీకి సభ్యుల్లో ఎవరు ఎవరికి మెయిల్ ఇచ్చినా.. దాని కాపీ ఆటోమేటిక్‌గా అందరికీ వస్తుంది.

‘ఇంటి పంట’ నిపుణులను సంప్రదించవచ్చు..

ఇంటి పంటల సాగుపై సందేహాలకు సమాధానాలివ్వడానికి నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (తార్నాక, సికిం ద్రాబాద్): 040- 27014302 / 27017735 (అన్ని పనిదినాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ).
అగ్రి. హార్టీకల్చరల్ సొసైటీ అధ్యక్షులు మిద్దెల అనంతరెడ్డి: 92461 08262 (ఏరోజైనా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ). సీనియర్ సిటీ ఫార్మర్ వేగేశ్న రామరాజు: 040- 2371 6633, 94401 92377 (సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య ఏ రోజైన

నేలను కప్పి ఉంచితే మేలు!

నేలను కప్పి ఉంచితే మేలు!
ఇంటి పంట 08 -04 -2011

ఎండ ధాటికి, చలికి, వర్షాలకు మనం శరీరాన్ని వస్ర్తాలతో రక్షించుకుంటున్నాం. కూరగాయలు, ఆకుకూర మొక్కలు పెరుగుతున్న మడులు, కుండీలలో మట్టిని ఎండ / వర్షం / చలి నుంచి కాపాడుకోవడం కూడా అవసరమే కదా! ఆకులు అలములతో, మొక్కలతో భూమిని కప్పి ఉంచడాన్ని ‘మల్చింగ్’ అంటారు.

వరి గడ్డి, చెరుకు పిప్పి, కొబ్బరి పీచు వంటి ఏ సేంద్రియ (కాలక్రమంలో కుళ్లి భూమిలో కలిసిపోయే) పదార్థంతోనైనా మల్చింగ్ చేయవచ్చు. ఎండాకాలంలో ఏ పట్టణంలోనైనా చెరకు రసం అమ్మే స్టాళ్లు ప్రతి వీధి మలుపుల్లోనూ కనిపిస్తుంటాయి. అక్కడి నుంచి బస్తాలతో చెరుకు తుక్కు(ఉచితంగానే)ను తెచ్చుకోవచ్చు. పీకేసిన కలుపు మొక్కలు, రాలిన ఆకులు, చొప్ప కూడా ఉపయోగించవచ్చు. మల్చింగ్ ద్వారా భూసంరక్షణ సాధ్యమవుతుంది. భూసారం పెరుగుతుంది. పట్టణాలు, నగరాల్లో మొక్కలు పెంచుకునే వారు మల్చింగ్ ద్వారా నీటి కొరతను కూడా అధిగమించవచ్చు.

మల్చింగ్ ఉపయోగాలు
ఎండ వేడిమి నేరుగా భూమికి తగలకపోవడం వల్ల నేలలోని తేమకు, సూక్ష్మజీవులకు నష్టం లేదు.

వర్షం కురిసేటప్పుడు చినుకులు నేరుగా కుండీ, మడిలోని నేలను ఢీకొట్టడం వల్ల కలిగే నేలగట్టిదనాన్ని తప్పించుకోవచ్చు.

వర్షపు నీరు పక్కలకు పోవడానికి ఆకులు, గడ్డి మొదలైనవి అడ్డుతగలటం వల్ల భూమిపై ఎక్కువసేపు తచ్చాడుతూ నేలలోకి ఇంకుతాయి.

భూమిపై కప్పే ఆకులు మొదలైన సేంద్రియ పదార్థాలు కుళ్లిపోతుంది. ఈ ప్రక్రియలో అది నేలకు పోషకాలను అందిస్తుంది. మల్చ్ ద్వారా నే లకు సూక్ష్మపోషకాలన్నీ సమపాళ్లలో అందుతాయి.

నేలపై మల్చ్ ఉంచడం ద్వారా కలుపును అదుపులో ఉంచవచ్చు. 5 సెం.మీ. మందం మల్చింగ్
వే స్తే కలుపు 90 శాతం తగ్గుతుంది.




ఇంటి పంటల సాగులో ఎదురవుతున్న సమస్యలకు సమాధానాలివ్వడానికి నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు.

సుస్థిర వ్యవసాయ కేంద్రం (తార్నాక, సికింద్రాబాద్): 040- 27014302 / 27017735 (అన్ని పనిదినాల్లో సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ). అగ్రి. హార్టీకల్చరల్ సొసైటీ అధ్యక్షులు మిద్దెల అనంతరెడ్డి: 92461 08262 (ఏరోజైనా సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల వరకూ). సీనియర్ సిటీ ఫార్మర్ వేగేశ్న రామరాజు: 040- 2371 6633, 94401 92377 (సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య ఏ రోజైనా).

‘ఇంటిపంట’ పాఠకులు నిపుణులను సంప్రదించడం కోసం, తమ అనుభవాలను పంచుకోవడం కోసం గూగుల్‌గ్రూప్స్.కామ్‌ను వినియోగించుకోవచ్చు. intipanta@googlegroups.comకు మెయిల్ పంపితే చాలు ఈ గ్రూప్‌లో సభ్యులు కావచ్చు. ఈ మెయిల్ ఐడీకి సభ్యుల్లో ఎవరు ఎవరికి మెయిల్ ఇచ్చినా.. దాని కాపీ ఆటోమేటిక్‌గా అందరికీ వస్తుంది.

రేపే నాగార్జున నగర్‌లో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్
ఎల్లారెడ్డిగూడలోని నాగార్జుననగర్ సంక్షేమ సంఘం హాలు(23750486)లో ఈ నెల 9 శనివారం సాయంత్రం (4 గంటల నుంచి 7 గంటల మధ్యలో) ఇంటి పంట వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ’, నాగార్జున నగర్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనదలచినవారు 040 23303849 నంబర్‌కు ఫోన్ చేసి పేర్లు నమోదుచేయించుకోవచ్చు.

చీడపీడలతో వేగడం ఎలా?

చీడపీడలతో వేగడం ఎలా?
ఇంటి పంట 15 -04 -2011

కిచెన్ గార్డెనింగ్‌కు సంబంధించిన సమస్యల్లో చీడపీడల బాధ ఒకటి. కూరగాయలు, ఆకుకూరలు ఇంటి పెరట్లోనో, కుండీలోనో, మేడపైనో పెంచుకునే వారిని ఏదో ఒక స్థాయిలో పురుగులు, చీడలు చికాకుపెడుతూనే ఉంటాయి. ‘అసలు ఏ చీడపీడలూ రాకుండా ఉండి ఉంటే బాగుంటుంది కదా?’ అన్న భావన కలుగుతూ ఉంటుంది. మొక్కలన్నాక చీడలు, పురుగులు ఎంతో కొంత మేరకైనా కనిపించకుండాపోవు. అయితే, అవి చేసే నష్టం తీవ్రతలో తేడాలుండొచ్చు. మనం వాడుతున్న మట్టి.. మొక్కలు ఆరోగ్యదాయకంగా ఉన్నప్పుడు చీడపీడలు కనిపించినా పెద్దనష్టం కల గదు.

అంటే.. మొక్కల పోషణకు- చీడపీడల తాకిడికి మధ్య సంబం ధం ఉందన్న మాట. పెరట్లో, కుండీల్లో, మేడ మీద ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల చెట్లు పెంచుకునే వారందరూ గమనించాల్సిన చాలా ముఖ్యమైన అం శం ఇది. ‘ఒక ఆరోగ్యవంతమైన మొక్కను ఆశించిన చీడపీడలు ఆకిలితో మాడతాయి’ అని ఈ సిద్ధాంతం చెపుతున్న ప్రధానాంశం! సేంద్రియ ఎరువు లతో మొక్కలు ఆరోగ్యంగా పెరు గుతాయి.

చీడపీడలంటే పంటను ఆశించే పురుగులు, తెగుళ్లు. చీడ పీడలు ఒక మొక్క మీద వృద్ధి చెందాలంటే ఆ మొక్కలో అధిక మోతాదులలో ‘నీటిలో కరిగి ఉన్న పోషకాలు’ ఉండాలి. ఎందుకంటే.. చీడ పీడలు మొక్కలోని మాంసకృత్తుల (ప్రొటీన్ల)ను నేరుగా తినలేవు. మాంసకృత్తులను జీర్ణం చేసుకునే ఎంజైమ్‌లు పురుగుల్లో ఉండవు. కాబట్టి వాటికి అవసరమైన అమినోయాసిడ్లు, చక్కెర, ఖనిజాలు మొక్కలోని రసంలో తగినంత మోతాదులో అందుబాటులో ఉన్నప్పుడు చీడపీడలు మొక్కలపై దాడిచేయడానికి వీలవుతుంది.

సాధారణంగా మొక్క పెరుగుదల సమయంలో వాటిలో అమినోయాసిడ్లు, చక్కెర వెంటనే మాంసకృత్తులుగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి, కణాలలోని రసాలలో అమినోయాసిడ్లు, చక్కెర చీడపీడలకు అవసరమైన మోతాదులలో దొరకవు. అటువంటప్పుడు మొక్కలను చీడపీడలు ఆశించినా.. తగిన ఆహారం లేక మాడతాయి. లేదా తమ సంతతి పెంచుకోలేక కునారిల్లుతూ కాలంగడుపుతూ ఉంటాయి.

అయితే.. చీడపీడలు రెండు సందర్భాల్లో విజృం భించే అవకాశం ఉంది. 1. మొక్కల్లో మాంసకృత్తుల తయారీకి ఏ కారణం వల్లనైనా ఆటంకం కలిగినప్పు డు. 2. మాంసకృత్తులు తయారుచేసుకోవడానికి అవసరమైన మోతాదుకంటే ఎక్కువ మోతాదుల్లో అమినోయాసిడ్లు, చక్కెరలు కణాల రసాల్లోకి చేరినప్పుడు. రసాయనాలు కొద్ది మోతాదుల్లోనయినా మొక్కల్లోకి ప్రవేశించినప్పుడు మాంసకృత్తుల తయారీ ప్రక్రియ కుంటుపడుతుంది. ఫలితంగా పోగుపడే అదనపు అమినోయాసిడ్లు, చక్కెరలను ఆహారంగా స్వీకరించి చీడపీడలు విజృంభిస్తాయి. రసాయనాల వాడకం వల్ల ఈ విధంగా చీడపీడల సమస్యను పరిష్కరించకపోగా పెంచడానికి దోహదపడుతుందన్నమాట.

పురుగులను పారదోలే పంటలు
ప్రత్యేకమైన వాసన కలిగి పురుగులను పారదోలే గుణమున్న కొన్ని పంటలు ఉన్నాయి. ఉదాహరణకు.. ఉల్లి మొక్కలకున్న ప్రత్యేకమైన వాసనను సీతాకోక చిలుకలు ఇష్టపడవు. క్యాబేజి మొక్కలతో పాటు ఉల్లిని కూడా కలిపి సాగుచేస్తే.. క్యాబేజిని ఆశించే పురుగులు తగ్గుతాయి. ఇలా ఉల్లిపాయ, క్యాబేజిలను కలిపి పండించటాన్ని సహపంటల విధానం అంటారు. పురుగులను నివారించటంలో ఈ సహపంటల విధానం బాగా పని చేస్తుంది.
-

రేపే పంజాగుట్ట ‘అరోరా’లో
‘ఇంటి పంట’ వర్క్‌షాప్

సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగుచేసుకోవడానికి సంబంధించిన అనేక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు పంజాగుట్టలోని అరోరా బిజినెస్ స్కూలులో 16వ తేదీ (శనివారం) సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకూ వర్క్‌షాప్ జరుగుతుంది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌కు నిమ్స్‌కు మధ్యలో.. ‘మోడల్ హౌస్’ పక్క రోడ్డులో అరోరా బిజినెస్ స్కూల్ (ప్రిన్సిపాల్ పాటూరి రవిని 99486 56599) ఉంది. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.

హ్యూమస్ దండిగా ఉంటే చీడపీడలు బాధించవు
పంటలకు చీడపీడల నిరోధక శక్తిని కలిగించడానికి ప్రకృతి ఒక అద్భుతమైన యంత్రాంగాన్ని అందించింది. నేలలో హ్యూమస్ (మొక్కలు, పశువుల వ్యర్థ పదార్థాలు కలిసి కుళ్లినప్పుడు.. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా సహాయంతో తయారయ్యే సేంద్రియ పదార్థం హ్యూమస్. ఇది ‘ఆకు ఎరువు’లో పుష్కలంగా ఉంటుంది) దండిగా ఉన్నప్పుడు ఈ యంత్రాంగం క్రియాశీలంగా ఉంటుంది; ఇది హ్యూమస్ లేని, లేదా నిస్సారమైన నేలల్లో పనిచెయ్యదు, అదే విధంగా రసాయనిక ఎరువులు వాడిన చోట కూడా పనిచెయ్యదు.

ఈ యంత్రాంగం పనిచెయ్యడానికి బాగా తయారుచేసిన, తాజా హ్యూమస్‌ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి, ఇదే దీనికి ఇంధనం. సారవంతమైన నేలలు రోగనిరోధక శక్తి కలిగిన పంటలను ఇస్తాయి. సారవిహీనమైన నేలలకు రసాయనిక ఎరువులు వేసినప్పటికీ పంట దిగుబడి పొందటానికి పురుగు మందులు, శిలీంధ్రనాశినుల సహాయం అవసరమవుతుంది.
- సర్ ఆల్బర్ట్ హవార్డ్,
సేంద్రియ వ్యవసాయ ఉద్యమ పితామహుడు
(‘జీవితానికి మూలాధారమైన వ్యవసాయం’ గ్రంథం నుంచి..)

ఇంటి పంట

అమృత మట్టి’తో నేల తల్లికి వందనం!
ఇంటి పంట 22 - 04 - 2011

నేల.. నేల తల్లి.. నేల తల్లి బాగుంటేనే.. ఆ తల్లి బిడ్డలమైన మనం బాగుంటాం.
అటువంటి తల్లి ఆరోగ్యాన్నే హరించే పనులు మనం చేస్తుంటే? ఇంకేముంది.. భవిష్యత్తు అంధకారమే!
ఈ హెచ్చరికనే ‘ధరిత్రి దినోత్సవం (ఏప్రిల్ 22)’ మరోసారి గుర్తుచేస్తోంది. అనాలోచిత మానవ చర్యల వల్ల కలుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించాలన్న బృహత్తర లక్ష్యంతో ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం.

ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనిషి చేస్తున్న పనుల వల్ల భూగోళం అమితంగా వేడెక్కిపోతోంది. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడడం వల్ల వాయుకాలుష్యం పెచ్చుమీరుతోంది. పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. వ్యవసాయంలో రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పదికాలాల పాటు పదిలంగా చూసుకోవాల్సిన భూమిని నిస్సారంగా మార్చుతున్నాం.

నేల అంటే నిర్జీవ పదార్థం కాదు. లక్షలాది సూక్ష్మజీవులు, పోషకాలతో కూడి ఉండేదే సుసంపన్నమైన నేల. దురదృష్టవశాత్తూ, వ్యవసాయం కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు భూమిని నిస్సారంగా, నిర్జీవంగా మార్చేస్తున్నాయి. జీవం కోల్పోయిన నేలలో దిగుబడులూ నాసిగానే ఉంటాయి. దీర్ఘకాలంలో దిగుబడులు మరీ తగ్గిపోయి ఆహార సంక్షోభాలకు దారితీసే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఆలివర్ డి షుట్టర్ గుర్తించారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాల వైపు మళ్లడం తప్ప మరో మార్గం లేదని ఇటీవల నివేదించారు.

వ్యవసాయంలో రసాయనాలు వాడే విధానాలను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలకపాత్ర వహిం చింది అమెరికా. ధరిత్రి దినోత్సవం పేరిట పర్యావరణ పరిరక్షణ ఉద్యమం కూడా అమెరికాలోనే ప్రారంభం కావడం విశేషం. 41 ఏళ్ల క్రితం ఏప్రిల్ 22న గేలార్డ్ నెల్సన్ నేతృత్వంలో కాలుష్యకారక విధానాలకు నిరసనగా జనం ఉవ్వెత్తున ఉద్యమించారు. అప్పటి నుంచీ సుస్థిర అభివృద్ధి కోసం ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల పర్యావరణ అనుకూల చర్యలను చేపట్టాలన్నది ఈ ఏడాది ధరిత్రి దినోత్సవ నెట్‌వర్క్ లక్ష్యంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా చేపట్టదగిన పనుల్లో.. బడిలోనో, కమ్యూనిటీ స్థలంలోనో సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల సాగు చేపట్టడం కూడా ఒకటి!

చైతన్య కరదీపిక ‘ఇంటి పంట’
‘ఇంటి పంట’ శీర్షిక ద్వారా పాఠకుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించడానికి విస్తృత కృషి చేస్తోంది. వంటింటి వ్యర్థాలతో చక్కటి సేంద్రియ ఎరువు (కంపోస్టు లేదా అమృత మట్టి) తయారుచేయడంపై పాఠకులు చైతన్యవంతులవుతున్నారు. ఇంటి పంట స్ఫూర్తితో రాష్ట్రంలోనే కాకుండా బెంగళూరు తదితర ప్రాంతాల్లో కూడా ‘సాక్షి’ పాఠకులు తమ ఇళ్లలో కంపోస్టు తయారుచేయడం ప్రారంభించారు. కంపోస్టు తయారుచేసుకోవడమే కాదు.. ఆ కంపోస్టుతో ఇంటి పట్టునే కుండీల్లో, మడుల్లో రసాయనాలు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం కూడా ప్రారంభిస్తున్నారు. తమకున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఏం చేయొచ్చు? అని సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్‌ను చేపడుతున్నారు.

ఒక వైపు ఇంటి పట్టున వ్యర్థాలతో కంపోస్టు తయారుచేసుకుంటూనే.. మరో వైపు కంపోస్టును కొనుగోలుచేసి కూరగాయలు, ఆకుకూరలు వీలున్నంతలో ఇళ్ల దగ్గరే సాగుచేసుకుంటున్నారు. వారి వారి అనుభవాలను మెయిల్ ద్వారా పంచుకుంటున్నారు. నిపుణులను, తోటి కిచెన్ గార్డెనర్లను అడిగి తమకు వచ్చే సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. కొన్ని కాలనీల సంక్షేమ సంఘాలు కామన్ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లను ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కొందరు తమకు దగ్గర్లోని పాఠశాలల వద్ద పెరటి తోటల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బడికి అనుబంధంగా కూరగాయల సాగును ప్రారంభించాలనుకుంటున్నామని కొందరు చెపుతున్నారు. వ్యక్తులే కాదు ప్రభుత్వాధికారులు సైతం ‘ఇంటి పంట’కు స్పందిస్తున్నారు.

హైదరాబాద్ నడిబొడ్డున పబ్లిక్ గార్డెన్స్‌లో రాలిన ఆకులతో చక్కగా కంపోస్టు దిబ్బలను ఏర్పాటుచేస్తున్నారు. ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ వెంకట్రామ్ రెడ్డి చొరవ తీసుకొని మొదట ఒక దిబ్బ ఏర్పాటుచేయించారు. ఆ ఉత్సాహం అంతటితో ఆగలేదు. పోగుపడుతున్న ఎండు ఆకులతో పచ్చి రొట్టను కలిపి కంపోస్టు దిబ్బలను ఏర్పాటు చేయిస్తున్నారు.

ఎండు ఆకులు వ్యర్థం కాదు.. ఇది గొప్ప వనరు అని అర్థమయ్యేలా సిబ్బందికి చెపుతూ ఉత్సాహపూరితంగా కంపోస్టు చేయిస్తున్నారాయన. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో పట్టణ వ్యర్థాలతో కంపోస్టు తయారుచేయడాన్ని ఇంటి పంట పాఠకులకు పరిచయం చేసిన తర్వాత అనేక మున్సిపాలిటీలలో ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నగరాలు, పట్టణాల్లో ఇంటి పంటలు పండించుకునే వారికి ఇన్‌పుట్స్ అందుబాటులోకి తేవడానికి కొన్ని సంస్థలు మౌలిక సదుపాయాలు కల్పించుకునే పనిలో ఉన్నాయి. తొలకరి నాటికి ఈ ప్రయత్నాలు కార్యరూపం దాల్చేఅవకాశం ఉంది.

అంతేకాదు.. సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు అనేక ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రైవేటు కంపెనీలు సైతం ముందుకొస్తున్నాయి.... ఇలా చెప్పుకుంటూ వెళితే ‘ఇంటి పంట’ స్ఫూర్తితో పర్యావరణానికి మేలుచేసే చర్యలకు ఎందరో పూనుకుంటున్నారు. పల్లెలు, పట్నాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వంటింటి వ్యర్థాలను తిరిగి వినియోగించడం.. రసాయనాలు వాడకుండా సహజమైన పద్ధతుల్లో ఇంటి పట్టునే కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడానికి ధరిత్రి దినోత్సవం సందర్భంగా అందరం పునరంకితమవుదాం. సమస్యలను అధిగమిస్తూ.. అనుభవాలను పరస్పరం పంచుకుంటూ ముందుకు సాగుదాం.. ధరిత్రిని పరిపరక్షించుకుందాం.. అర్బన్ అగ్రికల్చర్‌కు మౌలిక సదుపాయాలు కల్పించడానికి వీలుగా ప్రభుత్వంలో కదలిక మొలకెత్తుతుందని ఆశిద్దాం..



నేను ఐటీ ప్రొఫెషనల్‌ని. ‘ఇంటి పంట’ చదివి స్ఫూర్తి పొందా. ఆ రోజు నుంచే కంపోస్టు చేయడం.. ఆ తర్వాత కుండీల్లో ఆకుకూరలు పండించడం ప్రారంభించాను. బ్లాగ్ కూడా ప్రారంభించాను (https://organickitchengardening.wordpress.com).
-శ్రీలక్ష్మి, కోరమంగళ, బెంగళూరు

24న వనస్థలిపురంలో వర్క్‌షాప్
ఈ నెల 24వ తేదీన (ఆదివారం) సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకూ వనస్థలిపురంలోని (రెడ్ వాటర్ ట్యాంక్ దగ్గర) శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్ జరుగుతుంది. ,jగృతి అభ్యుదయ సంఘం (94902 18903) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితం.
పట్నంలో ‘డాబా పొలం’!
ఇంటి పంట 23-04-2011

కిచెన్ గార్డెనింగ్ చేపడుతున్న వారిలో ప్రతి ఒక్కరిదీ ఒక్కో విభిన్న శైలి. రెండంతస్తుల భవనం పైన కుండీలో, మడులో పెట్టడం కాకుండా.. టెరస్ ్రమొత్తాన్నీ పూర్తి స్థాయి పొలంగా మార్చేశారు శెట్టి శశికాంత్ కుమార్.

బ్రిటన్ నుంచి తెప్పించిన పోలివినిల్ రసాయనంతో పొరను వేసిన తర్వాత.. దానిపై పకడ్బందీగా డాబా పొలం సిద్ధమైంది. ప్రత్యేక ఆసక్తితో ప్రణాళికా బద్ధంగా స్వయంగా తానే ప్లాన్ వేసుకొని డాబా పొలం నిర్మించుకున్నారాయన. 1,050 చదరపు అడుగుల విస్తీర్ణంలో మేడపైన మట్టి, ఎరువుల మిశ్రమం పోసి.. పండ్ల చెట్లు, పూల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు నిశ్చింతగా పెంచుతున్నారు. అక్కడక్కడా కొన్ని బ్యాగ్‌లలో బహువార్షిక చెట్లు పెంచుతున్నారు.

హన్మకొండ పట్టణంలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు సమీపంలోని ప్రేమ్‌నగర్ కాలనీలో శశికాంత్ కుమార్ (94407 91812) ఇల్లు ఉంది. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడకుండా.. వర్మీ కంపోస్టు, వేప నూనె.. వాడుతూ ఇంటిపైనే పచ్చని తోటను పెంచుతున్నారు. ఈ మేడపై పరచుకున్న తోట ఆహ్లాదంతో పాటు ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందిస్తోంది.

ఇంటి అవసరాలకు మించి పండిన కూరగాయలు, ఆకుకూరలు ఇరుగు పొరుగు వారికీ ఇస్తున్నారు. బీర, సొరకాయ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ, టమాటా, వంగ, గుమ్మడితోపాటు పాలకూర, తోటకూర, చుక్కకూర, పుదీన, కొత్తిమీర, బచ్చలి, గోంగూర వంటి ఆకుకూరలను సైతం పండిస్తున్నారు. ఇతర రకాల కూరగాయలకు తప్ప మార్కెట్లో కొనాల్సిన అవసరం పెద్దగా రాదని ఆయన అంటున్నారు.


డాబా పొలం ఇలా....
రెండో అంతస్తు మేడపైన 6 అంగుళాల మందాన మట్టి మిశ్రమం పోశారు. ఎర్ర మట్టి, చెరువు మట్టి, వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు సమపాళ్లలో కలిపి మట్టి మిశ్రమం తయారుచేసి మేడపై ఆరంగుళాల మందాన పోసి మొక్కలు పెంచడం ప్రారంభించారు. చుట్టూ గోడల పక్కన 15 అంగుళాల మందాన మట్టి మిశ్రమం పోసి.. అందులో అంజూర, దేవగన్నేరు, మునగ, గులాబీలు, నిమ్మ తదితర చెట్లు పెంచుతున్నారు. కూరగాయలు, ఆకుకూరల మడులు కొన్ని ఏర్పాటుచేశారు. వృథా నీరు బయటకు వెళ్లడానికి చిన్న కాల్వలను ఏర్పాటు చేశారు. చెట్లు, మొక్కల చుట్టూ పరచుకున్న పచ్చని లాన్ ముచ్చటగొలుపుతూ.. మేడపైనే ఉన్నామా అన్నంతగా చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. వర్మీ కంపోస్టును తయారు చేయడానికి చెత్తాచెదారం, రాలిన ఆకులతో మేడపైనే ప్రత్యేకంగా రెండు బెడ్స్ ఏర్పాటుచేశారు.

ఈ ఎరువునే గార్డెన్‌కు వాడుతున్నారు. ఏడున్నరేళ్ల క్రితం టెరస్ ్రగార్డెన్ ప్రారంభించినప్పుడు తప్ప మళ్లీ ఎరువు కొనలేదు. ఎండలనూ తట్టుకొని పచ్చగా కనువిందుచేస్తున్నది ఈ విలక్షణమైన టెరస్ ్రగార్డెన్.



రేపే వనస్థలిపురంలో వర్క్‌షాప్

ఈ నెల 24వ తేదీన (ఆదివారం) సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకూ వనస్థలిపురంలోని (రెడ్ వాటర్ ట్యాంక్ దగ్గర) శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్ జరుగుతుంది. సాక్షి, జాగృతి అభ్యుదయ సంఘం (94902 18903) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితం.

మరో ఏడాదిలో మట్టి మార్చేస్తాం

వ్యర్థ పదార్థాలతో తయారు చేసుకున్న వర్మీ కంపోస్టు, వేప నూనె తప్ప మొక్కలకు మరేమీ వాడం. టెరస్ ్రగార్డెన్ గురించి ఇల్లు కట్టడానికి ముందే ఆలో చన ఉండడం వల్ల.. బీమ్స్‌ను కూడా బలంగా వేశాం. మేడ మీద ప్లాస్టిక్ షీట్ వేసి మట్టి మిశ్రమం పోద్దామని మొదట అనుకున్నా.. నాలుగేళ్లలో ఆ షీట్ చీకిపోతే గార్డెన్‌ను తీసెయ్యాల్సి వస్తుందని ఆ ప్రయత్నం మానుకున్నాను.

బ్రిటన్ నుంచి స్నేహితుడి ద్వారా రసాయనాన్ని తెప్పించి మేడపై పూసిన తర్వాత.. నిశ్చింతగా మట్టిపోసి చెట్లు, మొక్కలు పెంచుతున్నాం. ఏడున్నరేళ్లుగా శ్లాబ్‌కు ఎటువంటి ఇబ్బందీ రాలేదు.

చెట్లు బాగా పెరిగిపోయా యి. మట్టి మిశ్రమం మొక్కల వేళ్లతో నిండిపోయింది. దీని వల్ల పోషకాలు సరిగ్గా అందక పూలు, కాయలు సరిగ్గా రాకపోవచ్చు. వచ్చే ఏడాది మట్టి మొత్తాన్నీ మార్చి.. చెట్లను కత్తిరించి తిరిగి నాటుదామనుకుంటున్నాను. అలాచేసినా గార్డెన్‌కు నష్టమేమీ ఉండదు.

venkat

cheraku.venkatrao,                                                                                                                                                  ho.no.12-163,                                                                                                                                                             bramnawada.                                                                                                                                  dharmapuri.knr,'    pin-   505425                                                                                                                                                                     ph.   8985207328